Saturday, March 28, 2009

రెండో జాబితాలో మహిళలకు స్థానం: చిరు

తమ పార్టీ తరపున వెలువడే రెండో జాబితాలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి పేర్కొన్నారు. తాము మొదటినుంచి చెప్పినట్టుగానే తొలి జాబితా సందర్భంగా సామాజికన్యాయాన్ని పాటించామని ఆయన తెలిపారు.

ఈ విషయమై శనివారం కాకినాడలో చిరంజీవి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. అలాగే తాము అధికారంలోకి రాగానే రూ. 100కే వంటసరకు పథకంపైనే తొలి సంతకం పెడతామని స్పష్టం చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ పార్టీ తరపున టికెట్లు దక్కనివారిలో అసంతృప్తి సహజమేనని అన్నారు.

అయితే పార్టీలో ఉన్నవారందరికీ టికెట్లు ఇవ్వడం కుదరదని, ఈ విషయాన్ని గుర్తించి కష్టించి పనిచేస్తే భవిష్యత్‌లో తప్పక అవకాశాలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment