రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలవనున్న అభ్యర్ధులకు సంబంధించిన మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో బాగంగా లోక్సభకు పోటీ చేస్తున్న 22మందిని, అసెంబ్లీకి పోటీచేస్తున్న 55మందిని పార్టీ ప్రకటించింది.
ఈ జాబితాలోని వివరాల ప్రకారం టీడీపీ పార్లమెంటరీ నేత, మాజీ కేంద్ర మంత్రి కె ఎర్రన్నాయుడు శ్రీకాకుళం నుంచే మళ్లీ పోటీ చేస్తుండగా, ఉర్ధూ డైలీ పత్రిక సియాసత్ ఎడిటర్ అయిన జాహెద్ ఆలీ ఖాన్ హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరిపై టీడీపీ తరపున మాజీ ఎంపి ఎంవీవీఎస్ మూర్తి పోటీ చేయనున్నారు.
వీరితోపాటు మాజీ రాష్ట్ర మంత్రి ఎన్ మొహ్మద్ ఫరూఖ్ నంద్యాల నుంచి, మరో మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ఎలూరు నుంచి పోటీ చేస్తారు. బాబు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ మంత్రి, నటుడు ఎన్ శివ ప్రసాద్ చిత్తూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారు.
ఇక ప్రజారాజ్యం నుంచి వైదొలగి ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎన్ఆర్ఐ వాసంశెట్టి సత్య కాకినాడ నుంచి పోటీ చేయనున్నారు. టీడీపీ ప్రకటించిన ఈ తాజా జాబితాలో అనేక మంది మాజీ మంత్రులకు మళ్లీ స్థానం లభించడం విశేషం.
Saturday, March 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment